భారీ బడ్జెట్ చిత్రాలైన అఖండ, ఆర్ఆర్ఆర్, పుష్ప తదితర సినిమాలకు ధరలు పెంచుతామని థియేటర్ల యాజమన్యాలు తెలిపాయి. ఒక్కో టికెట్పై రూ.50 పెంచేందుకు అనుమతివ్వాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. అయితే ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో థియేటర్ల యాజమాన్యాలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి. అయితే థియేటర్ల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టి హైకోర్టు కీలక ఆదేశాలను వెలువరించింది. ఒక్కో టికెట్పై రూ.50 మేర పెంచేందుకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా థియేటర్ల తరపున న్యాయవాది.. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించడం లేదంటూ పేర్కొన్నారు. కాగా హైకోర్టు ఉత్తర్వులతో భారీ సినిమాల టికెట్ల రేట్లు పెరగనున్నాయి. అయితే.. ఇప్పటికే ఉన్న ధరలకు అదనంగా మరో రూ.50 వరకు ధరలు పెరగనున్నాయి.
తెలంగాణ లో సినిమా టికెట్ల ధరల పెంపునకు అనుమతి
December 02, 2021
0