మేడ్చల్ లో 1.32 కోట్ల నగదు స్వాధీనం

Telugu Lo Computer
0


తెలంగాణ లోని మేడ్చల్, పేట్ బాషీరాబాద్ పిఎస్ పరిధిలో భారీ మోసం బయటపడింది. ధనికవర్గాలకు భారీ ఆశ చూపిన  కోట్లలో మోసం చేశారు. వివిధ బ్యాంకుల నుండి మామూలు అకౌంట్ లా కాకుండా సెకండ్ ఛానల్ ( స్విస్ బ్యాంక్ ఎకౌంట్ లా) అకౌంటు ఓపెన్ చేస్తే పెద్ద ఎత్తున 1:3 రేషియో ప్రకారం డబ్బులు సంపాదించ వచ్చని నేరగాళ్లు ఆశచూపారు. సృజన్ అనే వ్యక్తి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి సత్యనారాయణ, ప్రియరంజన్ నాయక్, ప్రేమ్ కిషోర్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. విశాల్, సుశాంత్ ప్రేమ్దాస్ అనే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.1.32 కోట్ల నగదుతో పాటు ఒక ఎం.జి కార్, 3 సెల్ఫోన్స్, ఒక ల్యాప్టాప్ సీజ్ చేసి, రిమాండ్ కి తరలించినట్లు బాలానగర్ జోన్ డీసీపీ పద్మజ తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)