విస్కీ బ్రాండ్ కి ప్రచారం చేసిన పూజా హెగ్డే?

Telugu Lo Computer
0


హీరోయిన్ పూజా హెగ్డే ఓ ఆల్కహాల్ బ్రాండ్ ని ప్రమోట్ చేశారు. దానికి కోసం ఆమె స్వయంగా ఓ పెగ్ కలుపుకొని తాగి చిందేశారు. వీకెండ్ సెలబ్రేషన్స్ అంటే ఇలా ఉండాలి అంటూ ఆల్కహాల్ బ్రాండ్స్ ప్రమోషన్స్ నిర్వహించడం మన దేశంలో నిషిద్ధం. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే మత్తు పదార్థాలను ఎటువంటి మాధ్యమాల ద్వారా ప్రమోట్ చేయకూడని నియమం ఉంది. అయితే కొన్ని సోషల్ మీడియా మాధ్యమాలకు ఇది వర్తించడం లేదు. దీంతో ఇంస్టాగ్రామ్ వంటి ప్లాట్ ఫార్మ్స్ ద్వారా సెలెబ్రిటీలతో ఆల్కహాల్ బ్రాండ్స్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాయి సంస్థలు. తాజాగా పూజా హెగ్డే రెడ్ లేబుల్ ప్రీమియం విస్కీ బ్రాండ్ కి ప్రచారం కల్పించారు. సదరు బ్రాండ్ తాగితే ఫుల్ ఎంజాయ్ అన్నట్లు క్రేజీ స్టెప్స్ తో రెచ్చిపోయారు. మందు తాగి చిందేస్తున్న వీడియో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. ఆ వీడియోని దాదాపు మూడు మిలియన్స్ నెటిజెన్స్ వీక్షించారు. గుడ్డిలో మెల్ల అన్నట్లు. ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు, పద్దతిగా తాగండి అంటూ ఓ ఉచిత సలహా విసిరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)