తలుపు తట్టిన అదృష్టం!

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా అంటే గుర్తుకు వచ్చేది వజ్రాల గనులు. హిరాపూర్ తపరియన్ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నాయి. నిత్యం వందలాది మంది కూలీలు వజ్రాల కోసం అక్కడ పనిచేస్తుంటారు. ఇందులో పనిచేసే శంశేర్ ఖాన్‌కు గనిలో ఓ వజ్రం దొరికింది. 6 క్యారెట్ల 66 సెంట్ల బరువైన ఆ వజ్రాన్ని ప్రభుత్వానికి అందించారు. ఈ గనిలో దొరికిన వజ్రాలను ప్రభుత్వం వేలం వేస్తుంది. అలా వేలంలో వచ్చిన డబ్బును ఆ వజ్రం దొరికిన కూలీకి అందజేస్తుంది. ఈ వజ్రం సుమారు రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా. దీంతో చాలా కాలంగా కూలీగా పనిచేస్తున్న శంశేర్ ఖాన్ రాత్రికి రాత్రే ఇలా లక్షాధికారి అయ్యాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)