పెళ్లి చేసుకోనన్నందుకు హత్య!

Telugu Lo Computer
0

 


రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలోని పాంచల్‌వాడా గ్రామానికి చెందిన 12 వ తరగతి విద్యార్థిని హత్య కేసును పోలీసులు చేధించారు. దాంతీవాడ గ్రామానికి చెందిన విక్రమ్ మాలీ అనే యువకుడు ఆ విద్యార్థినితో మూడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. వీరిద్దరికీ ఏదో విషయమై తరచూ గొడవలు జరుగుతుండేవి. నిందితుడు ఆమెను హత్య చేయడానికి ముందు గూగుల్‌లో హత్య చేసే విధానాల గురించి సెర్చ్ చేశాడు. తరువాత ఆ విద్యార్థినిని పాంచల్‌వాడా గ్రామ శివారులోని వాటర్ ట్యాంకు పక్కనగల పంపు సెట్టు దగ్గరకు రమ్మన్నాడు. ఆమె అక్కడుకు రాగానే విక్రమ్ మాలీ.. ఎందుకు ఇంత లేటుగా వచ్చావని అడిగాడు. పెళ్లి చేసుకోవడం విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆమె తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తేల్చిచెప్పింది. దీంతో ఆవేశాన్ని ఆపుకోలేని విక్రమ్ ఆమె తలపై బండరాయితో మోదాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆక్కడిక్కడే మృతి చెందింది. వెంటనే అక్కడి నుంచి పరారైన విక్రమ్ ముంబై పారిపోయేందుకు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. ఇంతలోనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని రైల్వే ష్టేషన్ వద్ద అరెస్టు చేశారు. ఎస్ఫీ రాజన్ దుష్యంత్ తెలిపిన వివరాల ప్రకారం పోలీసుల విచారణలో నిందితుడు నేరం ఒప్పుకున్నాడని తెలిపారు. తనను పెళ్లిచేసుకోవాలని ఆమెపై విక్రమ్‌ ఒత్తిడి తెచ్చాడు. పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఆమె విక్రమ్‌కు చెప్పింది. తరువాత నుంచి ఆమె విక్రమ్‌తో మాట్లాడటం కూడా మానేసింది. ఆ తరువాత ఆమె మరో యువకునితో తిరగడం ప్రారంభించింది. దీనిని గమనించిన విక్రమ్ ఆమెకు ఫోన్ చేసి పంపు సెట్టు దగ్గరకు రమ్మన్నాడు. అక్కడకు వచ్చిన ఆమెను అత్యంత దారుణంగా హతమార్చాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు విక్రమ్ మొబైల్ ఫోనును స్వాధీనం చేసుకుని పరిశీంచారు. విక్రమ్ అంతకుముందు గూగుల్‌లో హత్య చేసే విధానాల గురించి సెర్చ్ చేశాడని పోలీసుల పరిశోధనలో తేలింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)