కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ నేతల వలస

Telugu Lo Computer
0


తెలంగాణ లోని మెదక్ జిల్ చిలిప్ చెడ్ మండలం జగ్గంపేట గ్రామానికి చెందిన 50 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ  నాయకులు పీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, అవుల రాజిరెడ్డి, సోమన్న గారి రవీందర్ రెడ్డి, ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. నర్సాపూర్ లోని ఎంపీపీ క్యాంపు కార్యాలయంలో పార్టీలోకి ఆహ్వానిస్తూ కార్యక్రమం నిర్వహించారు. చేరిన వారికి నర్సాపూర్ లోని ఎంపీపీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ నేతలు అవలంబిస్తున్న ద్వంద వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన 50 మంది కార్యకర్తలు పార్టీలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా వారు ప్రకటించారు. టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన వారిలో నవీన్, యాదగిరి, పోచయ్య, పుల్లయ్య, మోహన్, పాషా తదితరులు ఉన్నారు. త్వరలోనే మరికొంత మంది టీఆర్ఎస్ ముఖ్యనేతలు తమ పార్టీలోకి రానున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, కాంగ్రెస్ నాయకులు మల్లేశం, హకీమ్, రియాజ్, శ్రీనివాస్ గుప్తా, అశోక్, ఉదయ్, రాధాకృష్ణ గౌడ్, దేవి సింగ్ , కార్యకర్తలు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)