మద్యం వినియోగదారుల నుంచి వీలైనంత ఎక్కువ డబ్బులు గుంజేందుకు సిద్ధమైంది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా159 బార్లకు పర్మిషన్ ఇవ్వగా ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలా మరిన్ని వైన్ షాపులను తీసుకొస్తోంది. కొత్తగా 404 వైన్స్కు పర్మిషన్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం వైన్స్ సంఖ్య 2,620కి చేరనుంది. కొత్త మండలాలతో పాటు మరికొన్ని చోట్ల మద్యం దుకాణాలు తీసుకురానున్నారు. రాష్ట్రంలో ప్రతి రెండేండ్లకోసారి ఎక్సైజ్ పాలసీ మారుతుంటుంది. ఈ ఏడాది అక్టోబర్ నెలతో పాలసీ ముగిసినా దీన్ని ఈ ఏడాది నవంబర్ ఆఖరు వరకు పొడిగించారు. డిసెంబర్ ఒకటి నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో శనివారం పాలసీకి సంబంధించి నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. వైన్స్ కేటాయింపు ప్రాసెస్కు వచ్చే వారం తేదీలతో కూడిన నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ నెల 9 నుంచి అప్లికేషన్ల స్వీకరణ, 16 వరకు దరఖాస్తులకు గడువు, 18న డ్రా తీయనున్నట్టు సమాచారం.
తెలంగాణాలో 2,620 కి పెరగనున్న వైన్ షాపులు
November 07, 2021
0