హుజూరాబాద్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. తమ పార్టీ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ను పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఓ ప్రకటనలో వెల్లడించారు. బల్మూరి వెంకట్ నర్సింగ్ రావు ప్రస్తుతం ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. తెరాస తరఫున టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను బరిలో దించిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా అదే వ్యూహంతో ఆపార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ను ఖరారు చేసింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెంకట్ పేరును ప్రతిపాదించగా, కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు జీవన్రెడ్డి, శ్రీధర్బాబులు మద్దతిచ్చినట్టు సమాచారం. భట్టి ప్రతిపాదనకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ కూడా ఓకే అనడంతో బల్మూరి వెంకట్ పేరును ఆధిష్ఠానం ఖరారు చేసింది. ఈ నెల 30న హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.
హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్
October 02, 2021
0