పేటీఎం నవరాత్రి గోల్డ్ ఆఫర్

Telugu Lo Computer
0


ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ పేటీఎం తమ వినియోగదారులకు పండుగ సీజన్ల నేపథ్యంలో పేటీఎం నవరాత్రి గోల్డ్ ఆఫర్ ప్రకటించినట్లు సంస్థ తెలిపింది. ఇండియన్, హెచ్‌పీ గ్యాస్ లేదా భారత్ గ్యాస్ ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకోవడం ద్వారా రూ.10,001 విలువైన బంగారాన్ని గెలుపొందే అవకాశాన్ని ఉంటుందని సంస్థ తెలిపింది. నవరాత్రి గోల్డ్ ఆఫర్ అక్టోబర్ 7 నుంచి ప్రారంభమై అక్టోబర్ 16 వరకు కొనసాగుతుందని పేటీఎం వెల్లడించింది. పేటీఎం డిజిటల్ గోల్డ్‌తో పాటుగా ప్రతీ బుకింగ్‌పై యూజర్లు క్యాష్ బ్యాక్ పాయింట్లు కూడా గెలుపొందవచ్చని పేటీఎం తెలిపింది. పేటీఎం వాలెట్, పేటీఎం యూపీఐ, కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ లేదా పేటీఎం పోస్ట్ పెయిడ్ నుంచి చెల్లింపు విధానాలను ఎంచుకునే సౌకర్యం కల్పించినట్లు సంస్థ వెల్లడించింది. ప్రతిరోజూ 5 మంది అదృష్టవంతులైన వినియోగదారులు పేటీఎం యాప్‌పై తమ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ చేసుకుంటే రూ.10,001 విలువైన పేటీఎం డిజిటల్ గోల్డ్‌ను గెలుచుకోగలుగుతారు. పేటీఎం యాప్‌పై 'బుక్ గ్యాస్ సిలిండర్' ఫీచర్ ఉపయోగించి ప్రస్తుత అన్ పెయిడ్ సిలిండర్ బుకింగ్స్ చేసుకున్న వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. అదిగాకుండా, యూజర్లు అంతా కూడా ప్రతీ బుకింగ్ పై 1000 క్యాష్ బ్యాక్ పాయింట్లు పొందవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)