పన్నెండో శతాబ్దానికి చెందిన నటరాజ కంచు విగ్రహంతోపాటు మొత్తం 248 ప్రాచీన కళాఖండాలను అమెరికా గురువారం భారత్కు వెనక్కు ఇచ్చింది. వీటి విలువ రూ.112 కోట్లు (15 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. గత దశాబ్దకాలంలో అయిదు కేసుల నేర విచారణలో భాగంగా వీటిని రికవరీ చేసినట్లు మాన్హట్టన్ జిల్లా అటార్నీ వాన్స్ తెలిపారు.