అరె.. ఏం చేస్తున్నావ్‌...?

Telugu Lo Computer
0

 


మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కి చెందిన ఓ గుర్తుతెలియని కూరగాయల వ్యాపారిపై కేసు ఫైల్‌ అయ్యింది. పొద్దునే తాజా కొత్తమీర కట్టల్ని సింథికాలనీ రోడ్డుపై లీకైపారుతున్న డ్రైనేజీ వాటర్‌లో కడిగాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. డ్రైనేజీ నీళ్లతో కడిగితే ఆరోగ్యానికి ప్రమాదమని వీడియో తీసిన వ్యక్తి పదేపదే చెబుతున్నా సదరు వ్యాపారి మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయాడట. దీంతో జిల్లా కలెక్టర్‌ అవినాష్‌ లవనియా ఈ కల్తీ, కలుషిత ఆహార సమాచార సంఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆహార శాఖ, పౌర అధికారులకు ఆదేశించినట్లు మీడియాకు వెల్లడించారు. అంతేకాకుండా భోపాల్‌ జిల్లా ఆహార భద్రత అధికారి దేవేంద్ర కుమార్‌ దుబే ఐపీసీ సెక్షన్‌ 269 కింద సరదు గుర్తుతెలియని వ్యాపారిపై కేసు ఫైల్‌ చేశామని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెల్పారు.


Post a Comment

0Comments

Post a Comment (0)