తెలంగాణా రాష్ట్రం లోని ములుగు జిల్లా మంగపేటకు చెందిన నర్సింహ సాగర్కు చెందిన కాడబోయిన వీరయ్య (75) రోజులానే బుధవారం మధ్యాహ్నం పూరేడుపల్లి శివారులోని తన పొలం వద్దకు వెళ్లాడు. ఇంతలోనే ఉరుములతో కూడిన వర్షం మొదలవడంతో తలదాచుకు నేందుకు పొలం దాటుతుండగా పిడుగు పాటుకు గురయ్యాడు. కొద్ది దూరంలోనే ఉన్న ఇతర రైతులు దగ్గరికి వచ్చి చూడగా అప్పటికే వీరయ్య మృతి చెంది ఉన్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.