నవ దంపతుల నిర్బంధం !

Telugu Lo Computer
0


నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో నవదంపతులను కొందరు నిర్బంధించారు. గ్రామానికి చెందిన శ్రావణ్, సాయి శిరీష కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. పది రోజుల క్రితం జొన్నవాడలో వివాహం చేసుకున్న ఇద్దరు స్వగ్రామానికి వచ్చారు. వీరి పెళ్లి తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో ఇరు కులాలకు చెందిన పెద్దలు ఇద్దర్నీ ఎవరింటికి వారిని పంపించేశారు. తాజాగా ఇవాళ ఇద్దరూ పల్లెపాలమ్మ ఆలయంలో పెళ్లి చేసుకుంటుండగా పెద్దలు అడ్డుకున్నారు. సాయి శిరీష తండ్రి అక్కడికి చేరుకుని పెళ్లి ఆపి అమ్మాయిని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె బంధువులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో నవ దంపతులను ఆలయమంలోనే నిర్బంధించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)