కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ ఆస్కార్ ఫెర్నాండెజ్ (80) సోమవారం తుదిశ్వాస విడిచారు. కర్ణాటకలోని మంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫెర్నాండెజ్ ఈ రోజు మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. జులైలో యోగా చేస్తూ పడిపోవడంతో ఆయన తలకు గాయమై, రక్తం గడ్డ కట్టింది. అనంతరం వైద్యులు శస్త్రచికిత్స చేసి, గడ్డను తొలగించారు. అప్పటినుంచి ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నట్లు వారు తెలిపారు. ఫెర్నాండెజ్ యూపీఏ హయాంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీగానూ బాధ్యతలు నిర్వహించారు. ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీకి సన్నిహితులు. అలాగే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి పార్లమెంటరీ సెక్రటరీగానూ పనిచేశారు.
ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూత
September 13, 2021
0