బస్సు టైరు పేలి తండ్రీ కూతుళ్లు మృ తి చెందిన సంఘటన విషాదం మిగిల్చింది. చింతామణి-కోలారు రోడ్డు మార్గంలో శెట్టి మాదమంగళ గేట్ సమీపాన ఆర్టీసీ బస్సు టైరు పేలి అదుపు తప్పడంతో ఎదురుగా వస్తున్న టాటా ఏస్ను ఢీ కొన్న అనంతరం ద్విచక్రవాహనాన్ని ఢీ కొనడంతో తండ్రీ, కుమార్తె మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు కోలారు నుంచి చింతామణికి వస్తున్న కేఎ్సఆర్టీసీ బస్సు మొరార్జీదేశాయ్ పాఠశాల వద్ద టైరు పేలి అదుపు తప్పి ఎదురుగా వస్తున్న టాటా ఏస్ను ఢీ కొన్న అనంతరం ద్విచక్రవాహనాన్ని ఢీ కొంది. అనంతరం రోడ్డుపక్కనున్న చెట్టును ఢీ కొని ఆగింది. చింతామణి నుంచి కోలారుకు వెడుతున్న టాటా ఏస్ వెనుక క్యాబిన్ ఊడి ప క్కకు పడిపోయింది. డ్రైవర్ ప్రాణాపాయాలతో బయటపడ్డాడు. టాటాఏస్ వెనుక ద్విచక్రవాహనంపై ఆరేళ్ల కుమార్తె బిందుతో వస్తున్న రాజు (46) అక్కడికక్కడే మృతిచెందారు. బస్సు అదుపు తప్పి చెట్టును ఢీ కొన్న అనంతరం డ్రైవర్తోపాటు పదిమందికిపైగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీ డ్రైవర్ అశోక్ కాళ్ళు చేతులకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని కోలారు ఆసుపత్రిలో చేర్పించారు.
బస్సు టైరు పేలి ఇద్దరు మృతి
سبتمبر 17, 2021
0