కృష్ణా జిల్లా గన్నవరం ఆంధ్రా బ్యాంకులో చోరీ జరిగింది. సీసీ పుటేజ్ ఆధారంగా చోరీకి పాల్పడిన మహిళ, ఇద్దరు పిల్లల వివరాలను స్థానిక పోలీసులు సేకరిస్తున్నారు. ఇద్దరు పిల్లలతో ఓ మహిళ బ్యాంకుకు వచ్చింది. ఈ క్రమంలోనే బ్యాంకుకు వచ్చిన వేరే మహిళ బ్యాగు నుంచి 65 వేల రూపాయల డబ్బును కాజేసి ఇద్దరు పిల్లలతో కలిసి పరారైంది. గన్నవరం పోలీస్ స్టేషన్లో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
ఆంధ్రా బ్యాంకులో చోరీ
September 30, 2021
0