వేశ్యతో ప్రేమాయణం.....!

Telugu Lo Computer
0



ఢిల్లీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తి కొద్దిరోజుల క్రితం రూ. 50000 పెట్టి రెండు పిస్టల్స్, బుల్లెట్లు కొనుగోలు చేశాడు. వాటితో పాటు మరిన్ని ఆయుధాలు కొనుగోలు చేశాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ట్రాప్ వేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడు ఈ తుపాకీ, బుల్లెట్లు ఎందుకు కొనుగోలు చేశాడనే అంశంపై విచారణ చేపట్టారు. అయితే తన భార్యను చంపేందుకు నిందితుడు ఈ ఆయుధాలు కొనుగోలు చేశారని తెలుసుకుని షాక్ అయ్యారు. నిందితుడికి 2006లో వివాహమైంది. అతడు పదో తరగతి వరకు చదువుకున్నాడు. అతడికి ఇద్దరు స్కూల్‌కు వెళ్లే పిల్లలు ఉన్నారు. 2006, 2011లో అతడిపై ప్రాస్టిట్యూషన్ కేసులు ఉన్నాయి. 2015లో అతడిపై అక్రమ ఆయుధాలకు అంశంపై కేసు కూడా ఉన్నాయి. దీంతో నిందితుడు ఎవరినో చంపేందుకు ఆయుధాలు కొనుగోలు చేశారని అనుకున్నారు. కానీ భార్యను చంపేందుకు అతడు ప్లాన్ చేశాడని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కొద్దిరోజుల క్రితం నిందితుడు ఓ వేశ్య దగ్గరకు వెళ్లాడు. ఆ తరువాత ఆమె దగ్గరకు తరుచుగా వెళ్లడం మొదలుపెట్టాడు. ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఇందుకు నిందితుడి భార్య ఒప్పుకోలేదు. అందుకే ఆమెను చంపేందుకు ప్లాన్ చేశాడు. ఇందుకోసం ఆయుధాలు కొనుగోలు చేశాడు. విషయం పోలీసులకు తెలియడంతో.. నిందితుడు అరెస్ట్ కావడంతో పాటు భార్యను చంపాలనే అతడి ప్లాన్ బట్టబయలైంది. మరోవైపు నిందితుడిని ఆయుధాలు అమ్మిన వ్యక్తుల కోసంపోలీసులు గాలిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)