బంగాళాఖాతంలో అల్పపీడనం

Telugu Lo Computer
0



ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం నాడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావం బంగాల్‌, ఒడిశాలపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే.. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈనెల 11 వరకు కోస్తాంధ్ర తీరప్రాంత జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మరోవైపు.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీంతో రాగల 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)