యూనివర్సిటీలో మహిళలకు ప్రవేశం లేదు!

Telugu Lo Computer
0

 

అమెరికా సైన్యం వెను తిరిగిన తర్వాత మెరుపు వేగంతో ఆఫ్ఘనిస్థాన్‌ను వశం చేసుకున్న తాలిబన్లు తమ అణచివేత విధానాలను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని కాబూల్‌లో మహిళలపై వివక్షా పూరిత నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. కాబూల్ మున్సిపాలిటీలో ఉద్యోగాలు చేసే మహిళలను ఇంటికే పరిమితం చేస్తూ అక్కడి మేయర్ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం కాబూల్ యూనివర్సిటీలో తాలిబన్లు నియమించిన ఛాన్సలర్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకొని వార్తల్లో నిలిచాడు. యూనివర్సిటీలో  పని చేయడానికి, తరగతులకు హాజరవడానికి మహిళలను అనుమతించబోమని వర్సిటీ ఛాన్సలర్ మహమ్మద్ అష్రాఫ్ ఘైరాట్ ప్రకటించారు. ''అందరికీ నిజమైన ఇస్లాం వాతావరణం అందించే వరకూ వారిని అనుమతించబోం'' అని అష్రాఫ్ తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. కొన్నిరోజుల క్రితం వర్సిటీలో ప్రో-తాలిబన్ కార్యక్రమం జరిగింది. దీనికి తల నుంచి పాదాల వరకూ పూర్తిగా నల్లని దుస్తులతో కప్పుకొని మహిళలు కూడా హాజరయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)