రూ.55 లక్షలతో ఉడాయించిన డ్రైవర్ అరెస్టు

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్‌లో రూ.55 లక్షల నగదుతో ఉడాయించిన డ్రైవర్‌ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఊటీలో శ్రీనివాస్‌, అతని స్నేహితుడు విజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 10సి ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో నివసించే స్థిరాస్తి వ్యాపారి సంతోష్‌రెడ్డి వద్ద ఆరు నెలల కిందట కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన శ్రీనివాస్‌ డ్రైవర్‌గా చేరాడు. కోకాపేటలో ఉంటున్న ఓ స్థిరాస్తి వ్యాపారికి రూ.55లక్షలు ఇచ్చి రమ్మని సంతోష్‌రెడ్డి డ్రైవర్‌కు సూచించాడు. ఈ నెల 25న మధ్యాహ్నం 2 గంటలకు శ్రీనివాస్‌ కారులో నగదు తీసుకొని బయలుదేరాడు. సాయంత్రం 4 గంటలు దాటినా కోకాపేట చేరుకోలేదు. ఫోన్‌ చేసినా అందుబాటులోకి రాకపోవడంతో అనుమానించిన సంతోష్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను ఇవాళ అరెస్టు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)