విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ రోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి ని కలిశాడు. స్వయంగా చిరు ఇంటికి వెళ్లి ఆయనను కలిసి దిగిన ఫొటోను ప్రకాశ్ రాజ్ తన ట్విటర్లో షేర్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. 'ఈ రోజు ఉదయం బాస్ని జిమ్లో కలిశాను. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పరిష్కారాల కోసం ఆయన చొరవ తీసుకోవడం సంతోషంగా ఉంది. మీరెప్పుడూ మాకు స్పూర్తి అన్నయ్య' అంటూ ఆయన రాసుకొచ్చాడు. కాగా 'మా ఆర్టిస్ట్స్ అసోసియేషన్'(మా) ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ఈ సారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ చేస్తున్న వరుస ట్వీట్లు 'మా' ఎన్నికలను మరింత వేడెక్కిస్తున్నాయి. గతంలో ఎన్నికలు 'ఎప్పుడని' ఒకసారి 'తెగేవరకు లాగొద్దంటూ' మరోసారి ఆయన చేసిన ట్వీట్లు 'మా' దూమారం రేపాయి. ఇక ఇటీవల అగష్టు 15న 'జెండా ఎగరెస్తాం' అంటూ ట్వీట్ చేసి ప్రకాశ్ రాజ్ అందరిని ఆలోచనలో పడేశారు.
Post a Comment
0Comments
3/related/default