మాజీ డిప్యూటీ మేయర్ ఆకస్మిక మృతి

Telugu Lo Computer
0

 

గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్ గుండె పోటుతో ఆకస్మిక మరణం పాలయ్యారు. రాజ్ కుమార్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందన్నారు. క్రమశిక్షణతో పార్టీ కోసం పని చేసిన రాజ్ కుమార్ మరణం పార్టీకి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ తన సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)