ధారానగర శివార్ల లో కుమ్మరి దంపతులు నివసిస్తూ వుండేవారు. ఒకనాడు ఆ కుమ్మరి మట్టికోసం త్రవ్వుతూ వుండగా ఒక రత్నకలశం బయట పడింది.అతను భార్యను పిలిచి నీవు వెళ్లి రాజుకు ఈ వార్తా చెప్పిరమ్మన్నాడు.
ఆ కుమ్మరి పడుచు వెంటనే రాజుగారి సభ కు వెళ్లి ఆ రాజుతో యిట్లనెను.
దేవ మత్భర్త ర నాదృష్టం నిదానం వల్లభేనియే
న పశ్య న్నేవతత్రాస్తే త్వాని జ్ఞాన పయి తుభ్యగాం
తా:--- ప్రభూ! నా భర్త కుండలు చేయడం కోసం మట్టిని తవ్వు చుండగా నిధి యొక్కటి కనబడింది. దానిని చూసి ఆయన రాజుగారికి ఈ విషయము చెప్పి రమ్మని నన్ను పంపించగా వచ్చితిని . ప్రభువులు దానిని పరీక్షించి స్వాధీన పరుచుకోమని ప్రార్థన. భోజరాజు తన నగర వాసుల సత్యసంధత కు సంతోషించి వెంటనే ఆ ప్రదేశమునకు పోయి దానిని తెరిపించి చూశాడు. దాని యందు అమోల్యములైన రత్నములుండెను.అప్పుడు ఆ కుమ్మరి పడుచు రాజుతో నిట్లనెను.
రాజన్ చంద్ర స్స్వ మాలోక్యత్వాంతు భోథమమ్ గతం
రత్న శ్రేణి మసా న్మన్యే నక్షత్రాణ్య భ్యుపాగమం
తా:--రాజా! నేవీ భువికి చంద్రుని వంటి వాడవు. నిన్ను సేవించుట కై ఈ భూమిలోకి వచ్చిన నక్షత్ర శ్రేణి వలె
నీవు పరీక్షించు ఈ విలువైన రత్నములు మెరుస్తున్నవి.అన్నది
రాజు ఆ కుమ్మరి పడుచు చమత్కృతికి ఆనందించి ఆ నిధిని ఆ దంపతులకు యిచ్చివేశాడు.