అక్రమ సంబంధం బయటపడటంతో ఆత్మహత్య

Telugu Lo Computer
0

 

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగాళ్లపల్లి గ్రామానికి చెందిన శివ(27), శిరీష(25) దంపతులు. హాయిగా సాగిపోతున్న వీరి సంసారంలో ఇంటి పక్కనే ఉండే శ్రీకాంత్ అనే యువకుడు ప్రవేశించాడు. శిరీషకు అతడు అల్లుడు వరుస కావడంతో తరుచూ ఇంటికి వస్తుండేవాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. శివ ఇంట్లో లేని సమయంలో శిరీష తన అల్లుడితో రాసలీలలు కొనసాగించేది. ఈ విషయం బయట పడటంతో ఇరు కుటుంబాల వారు శిరీష, శ్రీకాంత్‌ను మందలించారు. దీంతో కొద్దిరోజులు సైలంట్‌గా వీరిద్దరూ ఇటీవల మళ్లీ తమ సంబంధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలోనే సోమవారం శివ పనిమీద వేరే ప్రాంతానికి వెళ్తూ, రాత్రికి రావడం ఆలస్యమవుతుందని భార్యకు చెప్పాడు. దీంతో భర్త లేకపోవడంతో శిరీష తన అల్లుడు శ్రీకాంత్‌కు కబురుపెట్టింది. అందరూ నిద్రపోయాక శ్రీకాంత్ రహస్యంగా శిరీష గదికి వెళ్లగా ఇద్దరూ రాసలీలల్లో మునిగితేలారు. ఆ సమయంలో నిద్రలేచిన శిరీష అత్తగారు ఏదో అలికిడి అవుతుందని కిటికీలో నుంచి చూసి షాకైంది. వారిద్దరికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని భావించి తలుపు బయట గడియ పెట్టి చుట్టుపక్కల వారిని పిలిచింది. ఈ విషయం గమనించి శిరీష, శ్రీకాంత్ అందరి ముందు పరువు పోతుందని భావించి గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకున ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు తలుపు తీసి లోనికి వచ్చేసరికే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)