భారత్ ఖాతాలో మరో పతకం
August 29, 2021
0
టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల హై జంప్ T47 విభాగంలో నిషద్ కూమార్ రజత పతకం సాధించాడు. 24 మంది సభ్యుల అథ్లెటిక్స్ జట్టులో నిషిద్ కూమార్ 2.06 మీటర్లు ఎత్తు ఎగిరి రెండో స్థానం లో నిలిచాడు. దీంతో నిషద్ కుమార్ రజతం కైవసం చేసుకున్నాడు.మరో వైపు ఆదివారం భవీనా బెన్ పటేల్ టేబుల్ టెన్నిస్ విభాగం మహిళల సింగిల్స్ క్లాస్ 4 పోటీల్లో రజత పతకం సాధించింది. దీంతో పారాలింపిక్స్లో ఒకేరోజు రెండు రజత పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. పారాలింపిక్స్లో రజత పతకాన్ని సొంతం చేసుకున్న అథ్లెట్ నిషాద్ కుమార్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.