'కొండపొలం' గా ఖరారు

Telugu Lo Computer
0

 

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వైష్ణవ్ తేజ్ రెండో సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను ఈరోజు రివీల్ చేశారు.  ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. రాజీవ్ రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి నవల 'కొండపొలం' ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు అదే పేరును ఖరారు చేశారు. సోషల్ మీడియాలో 'కొండపొలం' ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ మోషన్ ను తాజాగా రిలీజ్ చేశారు. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీని, ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ నవలా చిత్రాన్ని అక్టోబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇందులో వైష్ణవ్ తేజ్ కటారు రవీంద్ర యాదవ్ గా కనిపించబోతున్నాడు. వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం 'ఉప్పెన' సముద్రం నేపథ్యంలో తెరకెక్కగా, ఈ రెండో సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో రూపుదిద్దుకోవడం విశేషం.

Post a Comment

0Comments

Post a Comment (0)