3లక్షల కియా కార్ల అమ్మకం

Telugu Lo Computer
0


కియా ఇండియా మరో మైలురాయిని చేరుకుంది. అత్యంత వేగంగా అంటే రెండేళ్ల కాలంలోనే 3లక్షల యూనిట్లు అమ్మకాలు జరపగలిగింది. ఇండియాలో అతి తక్కువ కాలంలో ఇన్ని ఎక్కువ ప్రొడక్ట్‌లు అమ్మిన బ్రాండ్ ఇదే. జులై 2020 నాటికే మొదటి లక్ష యూనిట్లు అమ్మగలిగింది కియా. జనవరి 2021 కల్లా రెండు లక్ష యూనిట్లు అమ్మేసి ఆగష్టులోనే మూడో లక్ష కార్లను అమ్మగలిగింది. సంవత్సరంలో లక్ష కార్లను అమ్మిన కియా రెండో సంవత్సరంలో రెండు లక్షల కార్లను సేల్ చేసింది. ఇండియన్ మార్కెట్ లో సెల్టోస్ మోడల్ తో ఎక్కువ  అమ్మకాలు జరిపింది కియా. మొత్తం బ్రాండ్ అమ్మకాల్లో దీనివే 66శాతం ఉన్నాయి. స్మాలర్ సోనెట్  32శాతం అమ్ముడుపోయింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)