ప్రాణం తీసిన 10 రూపాయలు

Telugu Lo Computer
0

 

పడవ ఛార్జీ అడిగినందుకు ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు బీహార్ లో  కాల్చి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సమస్తిపూర్ జిల్లాలో బన్‌భౌరా గ్రామానికి చెందిన సికల్ యాదవ్‌ అనే యువకుడు గత కొద్ది కాలంగా బోటు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో  కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బోటులో ప్రయాణించారు. సికల్ యాదవ్‌ తన బోట్‌లో ప్రయాణించినందుకు రూ.10 చార్జీగా అడిగాడు. దీంతో ఆ వ్యక్తులు యువకుడుతో తీవ్రంగా ఘర్షణ పడ్డారు. దీంతో బోటులో ప్రయాణిస్తున్న గ్రామస్తులు జోక్యం చేసుకుని వారి నుంచి ఆ యువకుడిని రక్షించారని పోలీసులు తెలిపారు. అనంతరం సోమవారం ఉదయం సికల్ యాదవ్‌ తన ఇంటి ముందు నిలబడి ఉన్నప్పుడు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆ యువకుడు సంఘటన స్ధలంలో మృతిచెందాడని పోలీస్‌ అధికారులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)