సోనియాని పొగిడిన టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే

Telugu Lo Computer
0


తెలంగాణలో రాజకీయాలు మారుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తరవాత కాంగ్రెస్‌లో కూడా దూకుడు పెరిగింది. పార్టీని వీడిన నేతలు, ఇతర పార్టీల్లోని నేతలను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టిందని వార్తలు వస్తున్నాయి. అయితే అధికార టీఆర్ఎస్‌ను కాదని.. కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేలెవరూ ముందుకు రాకపోవచ్చని చాలామంది భావించారు. ఇలాంటి సమయంలోనే టీఆర్ఎస్‌లో చేరిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాములు నాయక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పొగడటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి థ్యాంక్స్ చెప్పాలని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. తెలంగాణ ప్రజల బాధలు చూసి సోనియా తెలంగాణ ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌ పార్టీలో ఉంటూ రాములు నాయక్ సోనియాగాంధీని పొగడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)