అనకాపల్లి లో ఘోర ప్రమాదం

Telugu Lo Computer
0


విశాఖ జిల్లాలో అనకాపల్లి వై జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ కుప్పకూలింది. ఫ్లైఓవర్ కింద నుంచి వెళుతున్న ట్యాంకర్ లారీ, కారుపై రెండు భీమ్‌లు కూలిపడ్డాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు మృతి చెందారు. లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన లారీ డ్రైవర్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కూలిన బ్రిడ్జి వద్ద సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బ్రిడ్జి క్రింద ఇంకెవరైనా చిక్కుకున్నారేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేసుతున్నారు. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)