ప్రముఖ నటి జయంతి కన్నుమూత

Telugu Lo Computer
0


ప్రముఖ నటి జయంతి మృతి చెందారు. 1963లో కన్నడలో 'జెనుగూడు' చిత్రంతో సినీ ప్రవేశం చేసిన జయంతి..తెలుగు, తమిళ, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించారు. ఇప్పటివరకు సుమారు 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, ఎంజీ రామచంద్రన్‌ వంటి ప్రముఖులతో నటించారు. మోహన్ బాబు నటించిన పెదరాయుడు చిత్రంలో ఆమె నటనకు గాను మంచి గుర్తింపు వచ్చింది. అలాగే సీనియర్ ఎన్టీఆర్ తో చేసిన జస్టిస్‌ చౌదరి, కొండవీటి సింహం, శాంతి నివాసం వంటి చిత్రాల్లోనూ ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కన్నడ నటి అయినప్పటికీ ఆమె నటించిన తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలోనూ తనదైన ముద్ర వేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తెల్లవారుజామున బనశంకరిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పలువురు ప్రముఖులు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)