బంగాళాఖాతంలో అల్పపీడనం
July 11, 2021
0
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్రా, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడిందని దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీర ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు.