ప్రాజెక్టులకు జలకళ

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. గోదావరి బేసిన్‌లో  రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయి. ఎస్సారెస్పీకి వరద భారీగా వస్తోంది. మంగళవారం సాయంత్రం వరకు ఎగువ నుంచి 92 వేల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తోంది. పూర్తి సామర్థ్యం 90.31 టీఎంసీలకు గాను 48 టీఎంసీల నీళ్లు చేరాయి. బుధవారం తెల్లారేసరికి నీటి నిల్వ 53 టీఎంసీల వరకు చేరనుంది. ఎగువ నుంచి వరద ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లోనే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుతం 1,079 అడుగుల మేర నీరు ఉంది. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)