హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్పై ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్పై అతివేగంతో దూసుకెళ్లిన బైక్ అదుపుతప్పి సేఫ్టీ వాల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడిపే యువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కొనిదెన గ్రామవాసి అశోక్(24)గా గుర్తించారు. హైదరాబాద్ కేపీహెచ్బీలోని తన సోదరుడు ఇంటికి వచ్చిన అశోక్.. లైసెన్స్ కోసం తిరుమలగిరిలోని ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో బైక్ అదుపుతప్పి ప్రాణాలు కోల్పోయాడు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు.
Post a Comment
0Comments
3/related/default