నెల్లూరు జిల్లా కోట గ్రామం ఎగువ చేనులో దారుణం చోటు చేసుకుంది. ఒకరిని చంపి గుడిసెలో వేసి తగలబెట్టి దుండగులు పరారయ్యారు. అనుమానం రాకుండా రాత్రికి రాత్రే కాలిన శవాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పూడ్చేశారు. మృతుడు ఉత్తమ నెల్లూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులుగా స్థానికులు గుర్తించారు. కర్మకాండల కార్యక్రమంలో జరిగిన వివాదమే హత్యకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.