చైనాలో భారీ వర్షాలకు 12 మంది మృతి

Telugu Lo Computer
0


చైనాలో అధిక వర్షాల కారణంగా సెంట్రల్ చైనీస్ సిటీ జెంగ్ జూ లోని సబ్ వేలో వెళ్తున్న ఓ రైలు బోగీలో నడుము లోతు నీరు చేరడంతో 12 మంది మృతి చెందారని అధికారులు వెల్లడించారు. అనేకమంది రైల్లో చిక్కుకుపోయారు. రైల్లో కూడా ఇంతటి వరదనీరు చేరడం ఎన్నడూ చూడలేదని ప్రయాణికులు చెబుతున్నారు. రోడ్లపై ఉండాల్సిన కారులు నీటిపై పడవల్లా తేలియాడుతున్నాయి. మరో కొన్నిరోజులపాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.  గత కొద్ధి  రోజులుగా భారీ వర్షాలకు నదులు, వాగులు  పొంగి పొర్లుతున్నాయి. ఈ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. హెనన్ ప్రావిన్స్‌లో గతంలో ఎప్పుడూ లేనంతగా వర్షాలు ముంచెత్తాయి. ఈ నగరంలో మంగళవారం రోజున 457.5 మీ.మీ వర్షం కురిసింది. గత వెయ్యి సంవత్సరాల కాలంలోఈ స్థాయిలో వర్షం ఎప్పుడూ కురవలేదని అక్కడి వాతావరణ శాఖ తెలియజేసింది. హెనాన్ ప్రావిన్స్‌లో సుమారు కోటి మంది ప్రజలను రక్షించేందుకు సైనికులు శ్రమిస్తున్నారు. రాష్ట్రంలోని పలు నగరాల్లో వీధులతో బాటు సబ్‌వే టన్నేల్‌లోకి నీరు చేరింది. అందులో నుంచి వెళ్తోన్న రైల్లోకి నీరు వచ్చింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దేశంలో అనేక చోట్ల కమ్యూనికేషన్ సంబంధాలు దెబ్బ తిన్నాయి. వీధులు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)