కమల్హాసన్ కథానాయకుడుగా ‘విక్రమ్’ అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలో సెట్స్పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడీ చిత్రం కోసం స్టంట్ కొరియోగ్రాఫర్లుగా అన్బు, అరీవు ద్వయాన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు లోకేష్ శనివారం ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కమల్, అన్బు, అరీవులతో కలిసి దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. ‘ఖైదీ’ చిత్రంతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు.