బయట తిరిగితే జరిమానా !
June 06, 2021
0
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జనాభా 17 లక్షలు. నగర జనాభాలో 20% మంది మాత్రమే టీకా తీసుకున్నారు. సరిపడా టీకాలు అందుబాటులో ఉన్నాయి. 45 సంవత్సరాలు పైబడిన వారు బయట తిరిగితే, వారికి రూ. 500 జరిమానా విధిస్తున్నారు. టీకాను వేసే కార్యక్రమం వేగవంతం చేయడానికి ఔరంగాబాద్ కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎక్కువ మందికి టీకా అందించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఔరంగాబాద్ కార్పొరేషన్ వైద్యాధికారి నీతా పదాల్కర్ తెలిపారు.