ఇది గొప్ప అవకాశం

Telugu Lo Computer
0

 


లంక టూర్‌ కోసం ఎంపిక చేసిన భారత్ జట్టులోని ఆటగాళ్లకి ఈ పర్యటన గొప్ప అవకాశమని కెప్టెన్ శిఖర్ ధావన్ వెల్లడించాడు. ముంబయిలోని ఓ హోటల్‌లో 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్న భారత ద్వితీయ శ్రేణి జట్టు.. శ్రీలంక గడ్డపైకి వెళ్లబోతోంది. ఈ క్రమంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి కెప్టెన్ శిఖర్ ధావన్ వర్చువల్‌గా మీడియా సమావేశంలో మాట్లాడాడు. జూన్ 13 నుంచి భారత్, శ్రీలంక మధ్య కొలంబో వేదికగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. లంక టూర్‌కి భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), యుజ్వేందర్ చాహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చాహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా ''శ్రీలంక టూర్‌కి ఎంపికైన టీమ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ పూర్తి కాన్ఫిడెన్స్‌తో కనిపిస్తున్నారు. అలానే ఉత్సుకతతోనూ సత్తాచాటేందుకు ఎదురుచూస్తున్నారు. సీనియర్, జూనియర్ల కలయికతో ఉన్న ఈ జట్టుకి శ్రీలంక టూర్ ఓ ఛాలెంజ్. ఇంకా చెప్పాలంటే సత్తాచాటేందుకు మాకందరికీ ఇది గొప్ప అవకాశం'' అని శిఖర్ ధావన్ వెల్లడించాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)