బోనులో చిక్కిన చిరుత !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని శంషాబాద్ లో ఆపరేషన్ చిరుత ఎట్టకేలకు సక్సెస్ అయింది. ఐదు రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కినట్లు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియల్ తెలిపారు. ఎయిర్ పోర్టు లోపలికి వచ్చిన చిరుత.. ఫెన్సింగ్ దూకినట్లు సిబ్బంది సీసీ కెమెరాల్లో చూసి గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. చిరుతను బంధించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ప్రత్యేకంగా 5 బోన్ లు 25 ట్రాప్ కెమెరాలు పెట్టీ ఎప్పటికప్పుడు అధికారులతో మానిటరింగ్ చేశామన్నారు. బోనులో చిక్కిన చిరుతను  నెహ్రూ జూ పార్క్ కు తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, ఒకరోజు పర్యవేక్షణ ఉంచి.. అడవిలో వదిలిపెడతామని తెలిపారు. చిరుతను పట్టుకునేందుకు శ్రమించిన రంగారెడ్డి జిల్లా డీఎఫ్ఓ సుధాకర్ రెడ్డి, డీఎఫ్ఓ విజయనంద్ లను ప్రత్యేకంగా డోబ్రియల్ అభినందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)