హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీ లతను ప్రధాని మోడీ ప్రశంశించారు. తాజాగా ఈమె 'ఆప్ కి అదాలత్' అనే షోలో పాల్గొన్నారు. ఈ షోలో ఆమె వ్యక్తపరిచిన ఆలోచనలనలకు ప్రధాని మోడీ ఫిదా అయ్యారు. మాధవవీ లతను ప్రశంసిస్తూ మోడీ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ''మాధవీ లతా జీ, మీ 'ఆప్ కీ అదాలత్' ఎపిసోడ్ అసాధారణమైనది. మీకు నా శుభాకాంక్షలు. ఈ రోజు ఉదయం 10 గంటలకు లేదా రాత్రి 10 గంటలకు ఈ ప్రోగ్రామ్ రిపీట్ టెలికాస్ట్ను చూడాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను'' అంటూ ట్వీట్ చేశారు. కొంపెల్ల మాధవి లత హైదరాబాద్లోని ప్రముఖ హాస్పిటల్స్లో ఒకటైన 'విరించి'కి చైర్మన్. అంతే కాకుండా బలమైన హిందూ భావాలను పుణికిపుచ్చుకుని, నగరంలో అనేక హిందూ మత కార్యక్రమాలలో పాల్గొంటూ ఎన్నో పరోపకారాలు చేస్తున్న ఈమెను బీజేపీ గుర్తించి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది.
మాధవవీ లతకు ప్రధాని మోడీ ప్రశంసలు !
April 07, 2024
0
Tags