పతంజలి ఆయుర్వేద నిర్వాహకులు బాబా రాందేవ్, బాలకృష్ణపై సుప్రీం కోర్టు మరోసారి మండిపడింది. తామేం అంధులం కాదని, ఈ కేసులో ఉదారంగా ఉండాలని అనుకోవడం లేదంటూ ధ్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో క్షమాపణలు తెలియజేస్తూ పతంజలి నిర్వాహకులిద్దరూ దాఖలు చేసిన అఫిడవిట్లను సైతం కోర్టు తిరస్కరించింది. అంతేకాదు, తప్పుడు ప్రకటన విషయంలో నిర్లక్ష్యం వహించిన ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగంపైనా సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. కోర్టు ఆదేశాలు ఇచ్చాక కూడా తప్పులు చేయడం ఏంటని మండిపడింది. ఈ కేసులో తాము ఉదారంగా ఉండాలని అనుకోవట్లేదని బెంచ్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
బాబా రాందేవ్ క్షమాపణలను తిరస్కరించిన సుప్రీంకోర్టు !
April 10, 2024
0
Tags