జగన్ మీద దాడి కేసు దర్యాప్తు వేగవంతం చేయాలి : రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్  సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి ఘటన కేసుదర్యాప్తును వేగవంతం చేయాలని విజయవాడ సీపీ, ఐజీలను రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబరులో వారిరువురితో ఆయన సమావేశమయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్వపరాలపై సమీక్షించారు. ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న మేమంతా సిద్దం బస్సు యాత్రలో ఏ విధంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది... దాడి చేసేందుకు నిందితులకు ఏ విధంగా అవకాశం ఏర్పడిందని పోలీస్ అధికారులతో సమీక్షించారు. అనంతరం కేసు దర్యాప్తుపై మీడియాకు సీపీ కాంతి రాణా వివరాలు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)