వైసీపీ కండువా కప్పుకున్న పోతిన మహేష్‌ !

Telugu Lo Computer
0


నసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్ ఈ ఉదయం గుంటూరు పర్యటనలో ఉన్న జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది వివిధ పార్టీల నేతలు అటు వాటు ఇటు ఇటు వారు అటు వెళ్తున్నారు. జనసేన తరఫున ఎప్పటి నుంచో పని చేస్తున్న పోతిన మహేష్ విజయవాడ పశ్చిమ టికెట్ ను ఆశించారు. అయితే పొత్తుల్లో భాగంగా ఆ టికెట్ ను బీజేపీకి వెళ్లింది. ప్రస్తుతం అక్కడ బీజేపీ మాజీ ఎంపీ సుజనాచౌదరి కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ టికెట్ తనను కాదని బీజేపీకి ఇవ్వడంపై పోతిన మహేష్ ఫైర్ అయ్యారు. తన లాంటి బీసీ నేతలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేస్తూ సోమవారం జనసేనకు రాజీనామా చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)