రూ. 4 కోట్ల నగదుతో పట్టుబడ్డ బీజేపీ కార్యకర్త !

Telugu Lo Computer
0


చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్ లో భారీగా నగదు పట్టుబడింది. బీజేపీ కార్యకర్త సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. సతీశ్ అనే బీజేపీ కార్యకర్త హోటల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఆయన తన సోదరుడు నవీన్, డ్రైవర్ పెరుమాల్ తో కలిసి ఆరు బ్యాగుల్లో రూ.4 కోట్ల నగదును చెన్నై నుంచి తిరునల్వేలీ తీసుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తాంబరం స్టేషన్ వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది రైలులో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తిరునల్వేలి బీజేపీ ఎంపీ అభ్యర్థి నైనార్ నాంగెన్థిరన్ ఆదేశాల మేరకే డబ్బును తరలిస్తున్నామని చెప్పినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తమిళనాడులోని 39 లోక్ సభ స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు జరుగనున్నాయి.  

Post a Comment

0Comments

Post a Comment (0)