కన్న కూతుర్ని కడతేర్చిన తల్లి ?

Telugu Lo Computer
0


తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో ఓ డిగ్రీ స్టూడెంట్ భార్గవి తీవ్రగాయాలతో మృతి చెందింది. భార్గవి మరణాన్ని పరువు హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె తల్లే భార్గవిని హతమార్చి ఉంటుందనే అనుమానాలు చాలా ఉన్నాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోతే జంగమ్మ, ఐలయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కూతురు భార్గవి దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే అదే ఊరికి చెందిన శశి అనే ఓ యువకుడితో భార్గవి ప్రేమలో ఉన్నట్లు, వారిని చుట్టుప్రక్కల వారు చూసి తన భార్గవి తల్లికి తెలిపారు. చాలా సార్లు వద్దని మందలించారు. వేరే పెళ్లి చెయ్యడానికి ప్రయత్నించారు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన భార్గవి, తాను ప్రేమిస్తున్న యువకుడి కబురు పెట్టింది. ఎవరూ లేని చోట వీళ్లిద్దరూ మాట్లాడుకుటుండగా తల్లి జంగమ్మ గమనించింది. ఈ విషయమై సోమవారం మరోసారి గొడవ జరిగింది. ఎంత చెప్పినా భార్గవి మాట వినడం లేదని తన తల్లే ఈ పని చేసి ఉంటుందంటున్నారు స్థానికులు. స్థానికులతో పాటు భార్గవి సోదరుడు చరణ్ కూడా ఇది తల్లి చేసిన పరువు హత్య కావచ్చనే స్టేట్మెంట్ తో ఈ కేసును పరువు హత్యగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఫోరన్సిక్‌ బృందాలతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముందుగా పరువు హత్యగా విచారణ జరిపిస్తున్నారు. అలాకాకుండా ఈ కేసుకు మరో కోణం ఉందా అనేది పోస్ట్ మార్టం రిపోర్టులు ఆధారంగా ఉంటుందన్నారు పోలీసులు.  

Post a Comment

0Comments

Post a Comment (0)