ఇండియా కూటమిలో టీఎంసీ ఉండాలనే కోరుకుంటున్నాం !

Telugu Lo Computer
0


'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్న టీఎంసీ పశ్చిమ బెంగాల్‌ పొత్తుల వ్యవహరంలో కాంగ్రెస్ పార్టీకి మొండిచేయి చూపింది. తాము ఒంటరిగానే లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతామని స్పష్టం చేసింది. 42 లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రకటించారు. అయితే ఇండియా కూటమిలో టీఎంసీ ఉండాలని తాము ఎప్పుడూ కోరుకున్నామని.. సీట్ల విషయంలోనూ చాలా సార్లు చర్చించుకున్నామని.. కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ అన్నారు. ఆ రాష్ట్రంలో పరిస్థితులు దీదీ నిర్ణయానికి కారణం అయ్యిండొచ్చన్నారు. అయినా.. తమ కూటమి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని.. తర్వాతి రోజుల్లో ఏం జరగబోతుందో చూద్దాం అంటూ జయరాం రామేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)