తెలంగాణలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ !

Telugu Lo Computer
0


భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికలు 2024 కోసం అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 195 స్థానాల్లో తెలంగాణ నుంచి తొమ్మిది  స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌రెడ్డి, కరీంనగర్‌ నుంచి బండి సంజయ్‌, నిజామాబాద్‌ నుంచి ధర్మపురి అర్వింద్‌లే పోటీ చేస్తారని తెలిపింది. చేవెళ్ల నుంచి కొండావిశ్వేశ్వర్‌రెడ్డి, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్‌, నాగర్‌కర్నూల్‌ నుంచి భరత్‌, జహీరాబాద్‌ నుంచి బీబీ పాటిల్‌కు అవకాశం ఇచ్చింది. ఇక హైదరాబాద్‌ నుంచి మాధవీలత పోటీ చేయనున్నారు. హాట్‌ నియోజకవర్గం భావిస్తున్న మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్‌ను బరిలోకి దింపుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)