బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి భారీ వలసలు

Telugu Lo Computer
0


తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు జోరందుకున్నాయి. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్‌ జెడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరితో పాటు జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఆయన సతీమణి చర్లపల్లి కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌ మామ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ తెలంగాణ ఇంఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా మున్షీ వీరికి హస్తం కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం నేతలంతా అసెంబ్లీకి వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)