ఉత్తరప్రదేశ్ లో గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ 2024 సందర్భంగా స్వీకరించిన పెట్టుబడుల ప్రతిపాదనల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.పది లక్షల కోట్ల విలువైన 14000 ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించి మాట్లాడుతూ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు ముందుకొస్తున్నాయని, భారత్లో అభివృద్ధిపై విదేశాల్లో చర్చ జరుగుతోందని అన్నారు. అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయి. ఇది తమ గ్యారెంటీ అని మోడీ స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, డబుల్ ఇంజిన్ సర్కార్తో యూపీలో పరిస్థితులు మారిపోయాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అంతకు ముందు ఉత్తరప్రదేశ్లోని సంభాల్ పరిధిలోని ఐంచోడ కాంబోహ్లోని శ్రీ కల్కి ధామ్ ఆలయానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.
ఉత్తరప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది !
February 19, 2024
0
Tags